గత కొంతకాలంగా తెర నుండి కనుమరుగైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లాంటి త్రిమూర్తులు ‘భైరవం’ సినిమాలో కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళంలో హిట్ అయిన గ్రామీణ చిత్రం ‘గరుడన్’ రీమేక్ అయిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. రెస్పాన్స్ యావరేజ్ గానే ఉంది.
అయితే, రిలీజ్ రోజునే మహేష్ బాబు ‘ఖలేజా’ మూవీ రీరిజిలీజ్ తో ‘భైరవం’ మొదటి రోజు కలెక్టర్ సగటు స్థాయికి తక్కువగా వచ్చింది. మహేష్ అభిమానులు థియేటర్లలో అదరకొట్టడంతో , ‘భైరవం’ షోలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
అయితే మొదటి రోజు సాయంత్రం షోలలో మంచి గ్రోత్ కనిపించింది. కానీ, అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్లేఆఫ్స్ మ్యాచ్ కూడా ప్రేక్షకుల హాజరును తగ్గించడంతో, సినిమా పై మళ్లీ ఛాలెంజ్ పెరిగింది. మరొక బాగా అనుకున్న షాక్ ఆ ఓటీటీ ఫ్లాట్ఫారమ్లపై విడుదలైన నాని ‘HIT 3’, మోహన్లాల్ ‘తుడరమ్’, సూర్య ‘రెట్రో’ లాంటి చిత్రాలు. ఈ సినిమాలు కూడా ప్రేక్షకులను అక్కడ బాగా బిజీ చేసి భైరవం వైపుకు రాకుండా చేసాయి.
శని,ఆదివారం ‘భైరవం’ టెలుగు రాష్ట్రాల్లో సాదారణ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేయటంతో, ఈ వారం రోజులలో మంచి కలెక్షన్లు సాధి లేకపోతే పెట్టుబడులు తిరిగి రాబట్టటం కష్టమే అనే తేలింది.
ఈ ఇబ్బందుల మధ్య, గురువారం నాడు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా థియేటర్లలోకి దిగుతోంది, ఇది భారీ అంచనాలతో వస్తోంది.
మొత్తం మీద ‘భైరవం’కి సవాళ్లే ఎక్కువ. విజయ్ కనకాలమేడల దర్శకత్వంలో, KK రాధామోహన్ నిర్మించిన ఈ మాస్ ఎంటర్టైనర్ విజయవంతం కావాలంటే ఈ పరిస్థితులను దాటాలి, కానీ కష్టమే అనిపిస్తోంది.